byసూర్య | Tue, Aug 16, 2022, 02:05 PM
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్దేశానుసారం మంగళవారం ఉదయం 11: 30నిం. లకు షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ గీతాలపన చేసిన శాసనసభ్యులు అంజయ్య యాదవ్, వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తదితరులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రపంచంలో ఎక్కలేని విధంగా భారత దేశ వజ్రోత్సవ వేడుకలు జరువుకోవడం, ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా సాగుతున్న ఈ వేడుకలు మన దేశ ఐకమత్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. సామూహిక గీతాలపనను చేయడం, మనమంతా కలిసిమెలిసి సహోదరులం అని చాటిచెప్పే కోట్లాది కంఠాల సామూహిక జాతి స్వరంగా ఈ జాతీయ గీతాలపన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.