byసూర్య | Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.