byసూర్య | Fri, Aug 05, 2022, 01:50 PM
ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీ నగర్ కాలనీకి చెందిన సావిత్రికి ఏడాది క్రితమే ఆమె భర్త మంచి విడాకులు పొందారు. ఆమెకు జూలై 31న బాబు జన్మించారు. ఆమె ఆరోగ్యం క్షిణించడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ఉన్న హిమగ్లోబిన్ ఐదు శాతం ఉండడంతో వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. ఆమె ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఎల్లారెడ్డి ఆసుపత్రిలో ఉంచారు.
దీంతో గురువారం సావిత్రి మృతి చెందారు. బాబు పుట్టిన ఐదు రోజులకే అమ్మ దూరం కావడంతో బాబు ఎక్కివెక్కి ఏడుస్తున్నాడు. బాబును చూస్తూ పలువురు కంటతడి పెడుతున్నారు. అంతకుముందు సావిత్రికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మొత్తం ముగ్గురు మగ పిల్లలు అనాధలుగా మారారు. ముగ్గురు మగ పిల్లలను సావిత్రి తల్లి సత్యవ్వ ఉన్నారు. ప్రభుత్వం మగ పిల్లలను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.