తెలంగాణలో పంజా విసురుతన్న కరోనా...అప్రమత్తమైన ప్రభుత్వం

byసూర్య | Wed, Jun 22, 2022, 01:29 AM

కరోనా వైరస్ తెలంగాణపై పంజా విసరడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. గత కొన్నిరోజులుగా 300కి లోపే నమోదవుతున్న కరోనా కేసులు, తాజాగా 400 దాటాయి. గత 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు నిర్వహించగా, 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM