byసూర్య | Tue, Jun 21, 2022, 01:50 PM
సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కుమార్ మృతి మీడియా రంగంలో విషాదాన్ని నింపింది ఈయన వయసు 44 ఏళ్ళు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరోజు తుదిశ్వాస విడిచారు.వివిధ సంస్థల్లో పని చేస్తున్న మీడియా మిత్రులు శ్రీనివాస్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. శ్రీనివాస్ మృతి పట్ల సూర్య దిన పత్రిక సిఏండి నూకారపు సూర్య ప్రకాష్ రావు గారు సంతాపం ప్రకటించారు. అయిన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ’ అని పేర్కొన్నారు.టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
సీనియర్ పాత్రికేయులు, సూర్య దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/PFtDi8GMkG
— Lokesh Nara (@naralokesh) June 21, 2022