ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి సందర్బంగా ఘన నివాళులు

byసూర్య | Tue, Jun 21, 2022, 01:27 PM

తెలంగాణ పోరాటంలో తనవంతు కృషిని అందించిన ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్ బాబా ఆచార్య జయశంకర్‌ కు ఘన నివాళులర్పించారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ అని ఆయన అన్నారు. వెలకట్టలేని సేవలు, అత్యున్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని స్పష్టంచేశారు. ఆయనతో పాటు హై స్కూల్ ప్రధానోపాద్యులు , మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వారి సిబ్బంది, ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించి పుష్పాంజలి తో ఘన నివాళులర్పించారు.


 


 


Latest News
 

లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు అభినందన Mon, Jun 05, 2023, 09:17 PM
రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్ Mon, Jun 05, 2023, 09:16 PM
బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది: వై.ఎస్.షర్మిల Mon, Jun 05, 2023, 09:16 PM
బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను నిలిపాం: మంత్రి కేటీఆర్ Mon, Jun 05, 2023, 09:15 PM
ఓ ప్రజాప్రతినిధితో డీఈ రమేష్ ఒప్పందం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్ Mon, Jun 05, 2023, 09:14 PM