సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Thu, May 19, 2022, 03:46 PM

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 23 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.19,08,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి గౌరవ సీఎం కేసీఆర్‌ గారు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

కుత్భుల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి కేపీ వివేక్‌కు 6757 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:39 AM
కేసీఆర్ కు 300 ఓట్లు.. హరీష్ రావు 6,305 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:35 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:34 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:32 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా Sun, Dec 03, 2023, 09:22 AM