byసూర్య | Tue, May 17, 2022, 05:46 PM
మంత్రి మంజూరు చేసిన స్థలంలో లైన్స్ క్లబ్ గీతాంజలి వారు నూతనంగా నిర్మించిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. మహేశ్వరం నియోజకవర్గం లో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండాలని ఎప్పుడూ ఒక కోరిక ఉండేది అట్టి కోరిక నేడు నెరవేరింది అని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్ లో నిర్మించాలని మంత్రి నిర్ణయించారు.
అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి కూడా నియోజకవర్గంలో త్వరితగతిన నిర్మిస్తామని మంత్రి తెలిపారు. పేద ప్రజలకి సేవ చేయడంలో లైన్స్ క్లబ్ ముందుకు రావడం పలు గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయడం, ఉచితంగా శస్త్ర చికిత్సలు కూడా చేయించినందుకు లైన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ రఘు, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ, అడ్వైజర్ చెన్నకిషన్ రెడ్డి , మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అనిల్ యాదవ్, లైన్స్ క్లబ్ సభ్యులు సిద్ధల బీరప్ప, రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.