రేపు ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష సమావేశం
byసూర్య |
Tue, May 17, 2022, 11:43 AM
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుగనున్నది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారని సీఎంవో కార్యాలయం అధికార పేజీలో వెల్లడించింది.
Latest News