ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

byసూర్య | Tue, May 17, 2022, 11:43 AM

పరీక్షల సమయంలో చదువుకొమ్మని తల్లిదండ్రులు మందలించిన కారణంగా ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని సిద్ధంతి బస్తీలోని నివసించే శ్రీనివాస్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. పరీక్షా సమయంలో బయట తిరగవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

మండలాల ఇంచార్జీల నియామకం Fri, Apr 19, 2024, 03:08 PM
బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యం Fri, Apr 19, 2024, 03:06 PM
సీఎం పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్ల రద్దు Fri, Apr 19, 2024, 03:04 PM
బీఫామ్ అందుకున్న బీఎంపీ అభ్యర్థి విజయ్ Fri, Apr 19, 2024, 03:01 PM
నేడు కురుమూర్తికి డీకే అరుణ రాక Fri, Apr 19, 2024, 02:55 PM