byసూర్య | Sat, May 14, 2022, 08:53 AM
నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్క పల్లి గ్రామంలో ఈ ఆదివారం నుంచి భూలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ స్రవంతి పరమేష్ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా రేపు గణపతి పూజ, నైవేద్యం, బండ్ల ప్రదర్శన, బోనాల ఊరేగింపు ఉంటుందని, 16న పాచీ బండ్ల ప్రదర్శన, అన్నదాన కార్యక్రమం, కుస్తీ పోటీలు నిర్వహిస్తామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.