byసూర్య | Sun, Jan 16, 2022, 06:43 PM
శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా ఎవర్ని వదలట్లేదు. దీనికి తోడు ఓమిక్రాన్ ఒకటి ఇప్పుడు తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరోసారి కరోనా సోకింది. దీంతో అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు. ఇటీవల అతనితో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మొదటి వేవ్లో ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ఆ తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్తిరెడ్డి భార్య, గన్మెన్, వంట మనిషి, డ్రైవర్కు కరోనా సోకింది.