byసూర్య | Thu, Jan 13, 2022, 09:24 PM
మెదక్ పట్టణంలో గురువారం బస్సు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న బస్సు, బైక్ ఢీకొనడంతో బైక్ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.మృతుడు చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.