byసూర్య | Wed, Jan 12, 2022, 01:12 PM
బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ధనలక్ష్మి అనే మహిళ తన పెద్ద కూతురు ఇంటికి వచ్చి ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.