byసూర్య | Wed, Nov 24, 2021, 01:39 PM
హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల 70 వేలతో పాటు నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్ లు, ప్రింటర్ , ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నిరుద్యోగుల నుంచి 23 లక్షలకు పైగా వసూలు చేశారని. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మోసాలకు పాల్పడుతున్నారన్న CP.... నిందితుల్లో ఒకరు విదేశాల్లో చదువుకున్నారని తెలిపారు.