byసూర్య | Sat, Nov 20, 2021, 12:28 PM
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20. 175 టీఎంసీలకు గాను శనివారం ఉదయం వరకు 20. 175 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1545 క్యూసెక్కుల నీరు వస్తుండగా, హైదరాబాద్ మెట్రో పనులకు 276 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, 2 గేట్లు ఎత్తి 1148 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.