byసూర్య | Fri, Apr 09, 2021, 08:51 AM
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఎటువంటి ఆధారాలు లేని 943 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారుగా రూ. 44.8లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారం తరలిస్తున్నఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.