మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Mar 31, 2021, 04:02 PM

తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం, హాలియా పట్టణాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని పట్టించు కోలేదని, అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని, వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్ కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన చరిత్ర దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఉందన్నారు. ఈ ప్రచారంలో మహమూద్ అలీ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భగత్ తల్లి నోముల లక్ష్మి పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM