అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

byసూర్య | Wed, Mar 31, 2021, 04:19 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలోని పాండవ బస్తీకి చెందిన బర్ల సత్యనారాయణ(40) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాగు చేసిన పంట మూడుసార్లు గోదావరి వరదకు గురై.. పంట నష్టపోవడంతో అప్పులు చేసి మరీ పంట వేశారు. అయితే, లాభం లేక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుమందు త్రాగటంతో అత్యవసర చికిత్స కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మృతిని భార్య కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM