byసూర్య | Wed, Mar 31, 2021, 04:19 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలోని పాండవ బస్తీకి చెందిన బర్ల సత్యనారాయణ(40) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాగు చేసిన పంట మూడుసార్లు గోదావరి వరదకు గురై.. పంట నష్టపోవడంతో అప్పులు చేసి మరీ పంట వేశారు. అయితే, లాభం లేక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుమందు త్రాగటంతో అత్యవసర చికిత్స కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మృతిని భార్య కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.