byసూర్య | Wed, Mar 31, 2021, 01:37 PM
హైదరాబాద్లోని కర్మాన్ఘాట్ దుర్గానగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మొయినాబాద్లోని మామిడి తోటలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుర్గానగర్ కాలనీకి చెందిన రాములు అనే డాక్యుమెంట్ రైటర్ ఇంటిలో ఆనంద్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అలాగే రాములుకు చెందిన మామిడి తోటలోనే ఆనంద్ శవమై కనిపించాడు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపేశారని ఇంటి యజమాని రాములుపై మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు.. రాములు ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.