byసూర్య | Wed, Mar 31, 2021, 01:32 PM
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సీఎం జిల్లా అని చెప్పుకొనే మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం దారుణమన్నారు. పటాన్చెరులో కాలుష్యం కోరలు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్కి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. దళితుల దగ్గర భూములు లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నారు.