తెలంగాణ కరోనా కేసులు

byసూర్య | Wed, Jan 20, 2021, 10:51 AM

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 27,471 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 267 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,583కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 351 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,86,893కి చేరింది.


ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,919 ఉంది. వీరిలో 2,270 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,42,537కి చేరింది. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ముందుగా ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రభుత్వం వ్యాక్సిన్ బులెటిన్ ను విడుదల చేసింది.


అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తెలంగాణలోని 894 సెంటర్లలో వ్యాక్సిన్ ను అందించారు. 73,673 మందికి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 51,997 మందికి మాత్రమే వ్యాక్సిన్ ను అందించారు. ఈరోజు 71శాతం మందికి వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM