byసూర్య | Wed, Jan 20, 2021, 08:41 AM
జిల్లాలోని బాలానగర్ మండలంలో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం సృష్టించాయి. మండలంలోని ఉడిత్యాల చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలియాడుతూ ఉన్నాయి. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థులు మృతదేహాలను గుర్తించారు. చెరువు సమీపంలో ఓ బైక్ కూడా ఉన్నదని స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకా రంతో మృతదేహాలను చెరువులోనుంచి వెలికితీశారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదచేసి, దర్యాప్తు చేస్తున్నారు.