ఫార్మా సిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతున్నాయి :కోమటిరెడ్డి వెంకటరెడ్డి

byసూర్య | Sun, Oct 11, 2020, 05:03 PM

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నం ఫార్మాసిటీ అంశంపై స్పందించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మాసిటీ ఓ శాపంలా మారిందని విమర్శించారు. గతంలో చౌటుప్పల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములిచ్చిన రైతులకు రూ.12 లక్షలు ఇచ్చి కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గ్రీన్ ఫార్మా సిటీపై కేసు వేస్తానని వెల్లడించారు. ఫార్మా సిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు.


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ, ఫార్మా సిటీ పోరు రాష్ట్ర గతిని మార్చేస్తుందని ఉద్ఘాటించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. భూములు ఇవ్వకుండా సహాయనిరాకరణ ఉద్యమం చేయాలని, ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM