byసూర్య | Sat, Apr 04, 2020, 11:11 AM
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ లో గుట్కా తయారీ కేంద్రంపై శంషాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు దాడులు జరిపారు. అంబర్ లేబుల్ తో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో గుట్కా తయారుచేసే నాలుగు మిషన్లను సీజ్ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుంది అని తెలిపారు.