byసూర్య | Tue, Mar 31, 2020, 12:46 PM
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో దినసరి కూలీలు, నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తనవంతు సాయం చేసేందుకు సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ముందుకొచ్చాడు. సూరారంలో 800 మంది నిరుపేదలకు కూరగాయలు సంతోష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు, దినసరి కూలీలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.