byసూర్య | Tue, Mar 31, 2020, 12:47 PM
కరోనా విజృంభిస్తున్న వేళ ... పోలీసులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే వారు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొంత మంది పోలీసులకు తిండి కూడా దొరకడం లేదు అన్నది వాస్తవం. అయితే ఇలాంటి సమయంలో కొంత మంది యువత తమకు అందుబాటులో ఉన్న పోలీసులకు పండ్లు పంపిణి చేస్తున్నారు. మెహదీపట్నం నవోదయ కాలనీకి చెందిన సందీప్ ఆకాష్, సాయినాథ్ లు తమ స్నేహితులతో కలిసి సోషల్ డిస్టెన్స్ లో ఉంటూ పండ్లు పంపిణీ చేస్తున్నారు.