byసూర్య | Thu, Jan 16, 2020, 10:58 AM
జగిత్యాల : మెట్పల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు.. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకులను గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్(18), రాంబాబు(20)గా పోలీసులు గుర్తించారు.