byసూర్య | Thu, Jan 16, 2020, 11:09 AM
నేడు ఏపీ, తెలంగాణ సీఎస్ల సమావేశం జరగనుంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీకి కొనసాగింపుగా సీఎస్ల సమావేశం కానున్నారు. ఆస్తుల విభజన విషయంలో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలపై.. సీఎస్ల భేటీలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో సీఎస్ల భేటీ జరిగే అవకాశం ఉంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.