పబ్ లో పట్టుబడ్డ 21 మంది యువతులు

byసూర్య | Mon, Jan 13, 2020, 01:17 PM

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాాచారమందింది. పోలీసులు పబ్ పై దాడి నిర్వహించగా 21 మంది యువతులు దొరికారు. ఈ పబ్ ను ఒక రోజు ఈవెంట్ కొరకు ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. అయితే యువతులతో అశ్లీల చిత్రాలు, నృత్యాలు చేయించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. యువతులను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల పై ఓ యువతి దాడి చేసి కెమెరాలు, ఫోన్లు కింద పడేసింది. మరికొంత మంది యువతులు తిట్లదండకం మొదలెట్టారు. పబ్ లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.


Latest News
 

మీకు తెలుసా..? పోలింగ్ కేంద్రంలో అలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష Fri, May 03, 2024, 09:58 PM
తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో.. ఆ 5 గ్రామాలు వెనక్కి, కీలక హామీలు ఇవే.. Fri, May 03, 2024, 09:55 PM
యాదగిరిగుట్టపై అపచారం.. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇదేం పని 'మాస్టారూ'..! Fri, May 03, 2024, 09:49 PM
పద్మశ్రీ మొగులయ్యకు కళాకారుల పింఛన్ ఆగిపోయిందా..? ఇదిగో ప్రూఫ్ Fri, May 03, 2024, 09:38 PM
పైకి ఎంబీబీఎస్ డాక్టర్‌నని కలరింగ్.. లోపల మాత్రం చేసేది Fri, May 03, 2024, 09:34 PM