బోయిన్‌పల్లిలో ఒకేసారి రెండు ఇళ్లలో చోరీ..

byసూర్య | Mon, Jan 13, 2020, 01:19 PM

సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులంతా ఊరెళ్లడంతో ఒకే రోజున రెండిళ్లలో దుండగులు చోరీ చేశారు. నగదు, నగలు అపహరించారు. ఏడడుగుల సమీపంలో ఉంటున్న ఆర్‌. అరవింద్‌కుమార్‌, అదే కాలనీలో ఉంటున్న ఎస్‌. మల్లారెడ్డి ప్రైవేట్‌ ఉద్యోగులు. వీరు కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండుగకు శనివారం స్వగ్రామాలకు వెళ్లారు. దుండగులు ఆదివారం తెల్లవారు జామున రెండిళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.


రెండిళ్ల తలుపులు విరగ్గొట్టి ఉండడం ఉదయం చూసిన ఇరుగుపొరుగు వారు బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితులకు సమాచారం ఇవ్వగా సాయంత్రానికి నగరానికి చేరుకున్నారు. అరవింద్‌కుమార్‌ ఇంట్లో రూ. 50 వేలు, 10 గ్రాముల బంగారం, మల్లారెడ్డి ఇంట్లో 30 గ్రాముల బంగారు నగలు చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM