byసూర్య | Sun, Oct 13, 2019, 05:34 PM
ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వరంగల్ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో మరో కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. రవి అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోని, నిప్పంటించుకునేందుకు యత్నిస్తుండగా వెంటనే నేతలు, కార్మికులు అతన్ని కాపాడారు. కార్మికుడు ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.