byసూర్య | Sun, Oct 13, 2019, 02:09 PM
ఈ నెల 19న తెలంగాణ బంద్కు మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్లో పాల్గొంటామన్నారు. డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్నారు. 48,500 మంది కార్మికులు తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ గుర్తించాలన్నారు.