byసూర్య | Tue, Aug 20, 2019, 09:50 PM
అమ్మయిలను వేధిస్తే ఆ ఆకతాయిలను గ్రామ బహిష్కరణ చేయాలంటూ ఓ గ్రామ పంచాయతీ తీర్మాణం చేసింది. వివరాల్లోకెళితే... జిల్లాలోని హుజురాబాద్ మండలం చిన్నపాపయ్య పల్లిలో మంగళవారం జరిగిన గ్రామసభలో ఊరి బాగు కోసం ఓ సర్పంచ్ వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే.. ఆడపిల్లలు, మహిళలు వేధింపులకి పాల్పడే పోకిరీలను గ్రామ బహిష్కరణ చేయాలి. గ్రామంలో బెల్ట్ షాప్ లు నిషేధించాలి, గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ఆదర్శంగా ఉన్న ఈ నిర్ణయాలతో ఈ గ్రామం నేడు వార్తల్లోకి ఎక్కింది.