byసూర్య | Mon, Aug 19, 2019, 11:52 AM
హైదరాబాద్ : తెలంగాణ రుతుపవనాలు మందగమనంలో సాగుతున్నాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో మాత్రం రుతుపవనాలు బలంగా ఉన్నాయని, అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల తర్వాత రుతుపవనాలు పుంజుకోవచ్చు అన్నారు. 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియవచ్చని తెలిపారు.