byసూర్య | Sun, Aug 18, 2019, 11:58 AM
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. మరికాసేపట్లో జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. జేపీ నడ్డా ర్యాలీగా బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బీజేపీ కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిలు, పదాధికారులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. సాయంత్రం 4.10 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు హరితప్లాజాలో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాత్రికి నడ్డా హైదరాబాద్లోనే బస చేయనున్నారు.