కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు జేపీ నడ్డా

byసూర్య | Sun, Aug 18, 2019, 11:58 AM

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మరికాసేపట్లో జేపీ నడ్డా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. జేపీ నడ్డా ర్యాలీగా బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బీజేపీ కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిలు, పదాధికారులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. సాయంత్రం 4.10 గంటలకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు హరితప్లాజాలో జరిగే బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాత్రికి నడ్డా హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM