byసూర్య | Sun, Aug 18, 2019, 12:45 PM
నాగర్కర్నూలు: యురేనియం నిక్షేపాల వెలికితీత పేరుతో నల్లమల అడవుల్ని సర్వనాశనం చేయబోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. యురేనియం తవ్వకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. నల్లమలలో ఒక్క చెట్టును కూడా ముట్టుకోనివ్వమన్నారు. అసలు నల్లమలలో అడుగే పెట్టనివ్వమని తేల్చిచెప్పారు. ఖనిజ నిక్షేపాల పేరుతో జరిగే దోపిడీని, వినాశనాన్ని అడ్డుకుంటామన్నారు. కృష్ణా జలాలను కలుషితం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.