byసూర్య | Sun, Aug 18, 2019, 11:06 AM
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్లో నడిరోడ్డుపై హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి డివైడర్పై పడవేశారు. బండరాయితో మోది చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు బంగారి నాగర్కర్నూలు జిల్లా నివాసి. బతుకు దెరువు కోసం హైదరాబాద్కు వచ్చి ఖైరతాబాద్ బీజేఆర్లో భార్య పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.