byసూర్య | Mon, Jun 24, 2019, 04:15 PM
నేపాల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. చైనా - నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన రెండు రాష్ర్టాల నుంచి యాత్రికులు మానస సరోవర యాత్రకు బయలుదేరారు. ఐదు రోజుల నుంచి వారు అక్కడ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. యాత్రికులు ఈ రోజు తాము ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు. యాత్రికుల అవస్థలను వారిని తీసుకెళ్లిన ట్రావెల్స్ సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు.