byసూర్య | Sun, Jun 23, 2019, 12:44 PM
పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులను వెల్గటూరు మండలం శాఖాపూర్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.