byసూర్య | Sun, Jun 23, 2019, 12:45 PM
నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ కూడలి వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి గోదాములో మంటలు చెలరేగాయి. షార్ట్సర్క్యూట్ ఇందుకు కారణంగా సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. రూ. కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.