byసూర్య | Mon, Jun 17, 2019, 11:08 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బిజెపి వైపులు అడుగు వడివడిగా వేస్తున్నట్టే కనిపిస్తోంది. సోమవారం ఉదయం ఆయన దేశ రాజధానికి వచ్చిన క్షణం నుంచి బిజెపి నేతలతో ఫోన్లో మంతనాలు చేస్తూ పార్టీలోకి పలువరిని తీసుకువచ్చే ప్రయత్నాలు ఆరంభించినట్టు సమాచారం అందుతోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయటంతో పాటు ప్రధాని మోడీని ప్రశంసించడమంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని వ్యతిరేకించడమేనని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే అధిష్టానం తనకు నోటీసులు ఇస్తే సమాధానమిస్తానని చెప్పిన రాజగోపాల్ తన సోదరుడు పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందనే ఢిల్లీ వచ్చానని, బీజేపీలో చేరే అంశంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.