లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం : మంత్రి జగదీష్ రెడ్డి

byసూర్య | Fri, Mar 15, 2019, 01:03 PM

సూర్యాపేట : ఏప్రిల్ 11న జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చూపిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు నల్లగొండలో జరిగే సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.  మోదీని ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ దేశం ఆకర్షించే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. ఏ పార్టీకి కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ రాదని మంత్రి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో గెలవబోతుందన్నారు. ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM