ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Tue, Jan 22, 2019, 03:43 PM

భువనేశ్వర్‌: ఒడిశాలోని కందమల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..గడాపూర్‌ నుంచి బ్రాహ్మణిగావ్‌ వెళ్తున్న ఓ ట్రక్కు బలిగూడ సమీపంలో పొయిగూడ ఘాట్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులో మలుపుతిప్పే క్రమంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా ట్రక్కు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం బెర్హంపూర్‌కు తరలించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM