byసూర్య | Tue, Jan 22, 2019, 03:45 PM
మహారాష్ట్రలోని నవీముంబై నౌద పట ప్రాంతంలోని ఓ టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.