byసూర్య | Mon, Jan 21, 2019, 02:05 PM
సూర్యాపేట : మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ గ్రామంలోని ఆరవ వార్డు తరపున సత్యం రాజు(70) అనే వ్యక్తి పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా గుండెపోటు రావడంతో బూత్ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో సత్యం రాజును చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.