byసూర్య | Mon, Jan 21, 2019, 02:08 PM
పాట్నా: ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలే బెటర్ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలతోనే ఓటింగ్ నిర్వహించాలని, అవే సరైన ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి బూత్లోనూ వీవీప్యాట్లను పెట్టాలని ఆయన సూచించారు. ఈవీఎంలు వచ్చిన తర్వాతే ఓటింగ్ శాతం పెరిగిందని నితీశ్ తెలిపారు. రెండు రోజల క్రితం జరిగిన మహా కూటమి మీటింగ్లో కొందరు నేతలు ఈవీఎంలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.