byసూర్య | Fri, Jan 18, 2019, 11:40 AM
హైదరాబాద్ : కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన మాధవరం కృష్ణారావు ఇవాళ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మాధవరం కృష్ణారావు చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం ఇప్పటి వరకు 115 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, రాజాసింగ్, సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.