byసూర్య | Fri, Jan 18, 2019, 11:38 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు. అనంతరం స్పీకర్గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్, అధికార, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.