114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం

byసూర్య | Thu, Jan 17, 2019, 02:16 PM

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఇవాళ 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరు కాలేదు.


Latest News
 

మీకు తెలుసా..? పోలింగ్ కేంద్రంలో అలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష Fri, May 03, 2024, 09:58 PM
తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో.. ఆ 5 గ్రామాలు వెనక్కి, కీలక హామీలు ఇవే.. Fri, May 03, 2024, 09:55 PM
యాదగిరిగుట్టపై అపచారం.. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇదేం పని 'మాస్టారూ'..! Fri, May 03, 2024, 09:49 PM
పద్మశ్రీ మొగులయ్యకు కళాకారుల పింఛన్ ఆగిపోయిందా..? ఇదిగో ప్రూఫ్ Fri, May 03, 2024, 09:38 PM
పైకి ఎంబీబీఎస్ డాక్టర్‌నని కలరింగ్.. లోపల మాత్రం చేసేది Fri, May 03, 2024, 09:34 PM